الوصف
في هذه المقالة نجد الأدلة على أن الإسلام هو الوحيد الذي يقدم المساواة بين الناس ويعدل بينهم على حد سواء.
మానవులంతా సమానమే
﴿في الإسلام المساواة الحقيقية بين الناس﴾
] తెలుగు – Telugu – التلغو [
Imam Muhammad Baianonie
అనువాదం : సయ్యద్ యూసుఫ్ పాషా
పునర్వమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్
2009 - 1430
﴿في الإسلام المساواة الحقيقية بين الناس﴾
« باللغة التلغو »
إمام محمد بَيْيانوني
ترجمة: سيد يوسف باشا
مراجعة: محمد كريم الله
2009 - 1430
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో
మానవులందరూ సమానులే అని ఇస్లాం ధర్మం ప్రకటిస్తున్నది
సూరా అల్-హుజురాత్(49:13)లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఓ మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు."
దివ్య ఖుర్'ఆన్ లోని ఈ వచనంతో మానవులందరూ సమానులే అని ఇస్లాం ధర్మం ప్రకటిస్తున్నది. ఎందుకంటే ఇస్లాం ప్రతి మనిషినీ మనిషిగా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. రెండు వర్గాల మధ్య గానీ, రెండు జాతుల మధ్య గానీ లేక రెండు వర్ణాల ప్రజల మధ్య గానీ వ్యత్యాసాన్ని చూపదు. ప్రవక్త ముహమ్మద్ (అల్లాహ్ యొక్క కరుణ, కృప ఆయనపై కురియుగాక) తన చివరి హజ్ యాత్ర సందర్భంగా, ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించారు. తమ ప్రసంగంలో వారు ఇలా అన్నారు “ఓ ప్రజలారా! మీ దేవుడు ఒక్కడే; మీ అందరి తండ్రీ ఒక్కడే. ఒక అరబ్బు దేశస్తునికి అరబ్బేతరునిపై గానీ, లేక ఒక అరబ్బేతరునికి ఒక అరబ్బు పై గానీ, అలాగే ఒక తెల్లవానికి నల్లవానిపై గానీ, లేక ఒక నల్లవానికి తెల్లవానిపై గానీ ఎటువంటి ఆధిక్యతా లేదు – కేవలం అత్యంత ధర్మనిష్టా పరునికి తప్ప. మీలో ఎవరైతే అతి ధర్మనిష్టాపరులో వారే అత్యంత గౌరవనీయులు."
'సర్వమానవ సమానత్వాన్ని' ఇస్లాం ఒక ధార్మిక సిధ్ధాంతంగా నొక్కి చెప్పటమే కాకుండా, ఆచరణలలో కొన్ని ఆరాధనల ద్వారా చేసి చూపెట్టినది కూడా. ఆ విధంగా 'సర్వ మానవ సమానత్వ సిధ్ధాంతాన్ని' ప్రజల మనస్సులలో నుంచి తొలగించలేని, ఒక గమనార్హమైన సత్యంగా ఆవిష్కరింపజేసినది.
ఇస్లాంకు పూర్వం పరిస్థితి ఇలా ఉండేది – ఉన్నత వంశంలోని వారెవరైనా ఏదైనా తప్పు చేస్తే, వారికి విధించబడే శిక్షలు సులభమైనవిగానో, కొన్ని సందర్భాలలో అసలు ఏ శిక్షా విధించకుండా వదిలివేయడమో జరిగేది. అదే పేద, నిమ్న వర్గాల ప్రజలలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, వారి చిన్న చిన్న తప్పులకు కూడా కఠినాతి కఠినమైన శిక్షలు విధించటం జరిగేది. కానీ ఇస్లాం వచ్చిన తరువాత ఈ స్థితి పూర్తిగా మారి పోయింది. దీనికి ఉదాహరణగా ప్రవక్త ముహమ్మద్ జీవితకాలంలో జరిగిన ఈ సంఘటన గమనించండి.
అరబ్బు తెగలలో అత్యున్నతమైనదిగా భావించబడే ఖురైష్ తెగలోని ఒక స్త్రీ దొంగతనం ఆరోపణలు ఋజువు కావటంతో శిక్షకు అర్హురాలైనది. ఆవిడ ఉన్నత వంశాన్ని పరిగణలోనికి తీసుకుని శిక్షను కొంచెం తగ్గించేలా సిఫారసు చేయమని ప్రవక్త సహచరులలోని కొందరు సహాబాలు, ప్రవక్త ఎక్కువగా ఇష్టపడే ఉసామా బిన్ జైద్ ను ప్రవక్త వద్దకు పంపినారు. ఈ విషయమై ఉసామా సిఫారసు చేయటానికి ప్రయత్నించగా, ప్రవక్త తీవ్రకోపంతో ఇలా అన్నారు – “మీ పూర్వీకులు ఇదే విధంగా విబేధం పాటించేవారు – ఉన్నత వంశీయులు దొంగతనం చేస్తే వారిని ముట్టుకునేవారు కాదు. అదే పేదవారు చేస్తే, వారిని శిక్షించేవారు. విను – ఈ ముహమ్మద్ కూతురు ఫాతిమా అయినా సరే - దొంగతనం చేస్తే, నిశ్చయంగా నేను ఆమె చేతులు ఖండించి ఉండే వాడినే."
సన్మార్గగాములుగా పరిపాలన సాగించిన ఖలీఫాల కాలంలో 'మానవులంతా సమానమే' అని ఆచరణలో అమలు చేసి చూపించిన సంఘటనలు కోకొల్లలు. మచ్చుకు రెండు ఉదాహరణలు:
ఇదీ ఇస్లాం అంటే – మనిషికీ మనిషికీ మధ్య విపరీతమైన వ్యత్యాసాలు పాటించబడే, అంటరానితనం, పేదా -గొప్పా తారతమ్యం, ఉన్నత వంశస్తులు -నిమ్న వంశస్తులు అనే భేదభావాలూ, సవాలక్ష అవలక్షణాలతో కూడిన ఆనాటి సమాజంలో, దాదాపు 1400 సంవత్సరాల క్రితమే, 'మానవులంతా ఒక్కటే' అని సర్వ మానవ సమానత్వాన్ని ఎలుగెత్తి చాటి, ఆచరించి మరీ చూపినది.
ఇదే ఇస్లాం ధర్మం యొక్క విజయ రహస్యం.